పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని తరకనగర్ కు చెందిన దండేవర్ లక్ష్మిబాయి(46).
వృతి కూలీ పనులు చేసుకుంటారు. ఆగస్ట్ 31 న రోజువారీగా కూలీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. అర్థ రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది.
దీంతో పక్కనే ఉన్న కొడుకు తెలపడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుడుకు మాధవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండీ ఆరీఫ్ తెలిపారు.
