నగరంలో మరోసారి గ్యాంగ్ వార్ కు తెరలేసింది. రెండు గ్రూప్ లమధ్య గత రాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఓ యువకుడు తల్వార్ హల్చల్ చేసాడు. ఈ ఘటను ఆరో టౌన్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అజ్జు అనే యువకుడు సారంగాపూర్ శివారు లోని బావని దాబా వద్ద వుండగా ఆరుగురు యువకులు బైక్ లమీద వచ్చి అజ్జు చితకబాదారు. వీరంతా గతంలో ఘర్షణ కేసులో ఉన్నవారే.
అదీగాక హత్య కు గురైన రౌడీ షీటర్ అనుచరులే. తాము అంజాద్ బాయి చెప్పడం వల్లే కొట్టామని చెప్పారు. దీనితో అజ్జు తల్వార్ తీసుకోని అంజాద్ ఇంటికి వెళ్లే హల్చల్ చేసాడు. కానీ ఆ సామ్యంల్ అంజాద్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కొడుకు కొట్టి వెళ్లి పోయాడు.
ఇద్దరు రౌడీ షీటర్ల హత్య తర్వాత ఇపుడిప్పుడే పరిస్థితులు సద్దామనుగుతున్నాయి. మళ్ళీ ఆ గ్రూప్ లకు చెందిన దాడులకు దిగడం తో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
