నిజామాబాద్ జిల్లాలో ఓ పావురం కలకలం రేపింది. బోధన్ మండలం భవానిపేటలోఓ పావురం అనుమానాస్పద స్థితి కనిపించింది ..
బాలుడికి ఆ పావురం దొరికింది. అయితే ఆ పావురం కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో గ్రామస్థులు గూఢచారి పావురంగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చివరికి అది రేసింగ్ పావురంగా గుర్తించినట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు స్పష్టం చేశారు.
