శనివారం రెప్ప పాటు కాలం లో తప్పించుకున్న రియాజ్ కోసం ఆదివారం ఉదయమే ప్రత్యేక బలగాలు రంగం లోకి దిగాయి.
గతంలో నక్సల్స్ కోసం అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టినట్లు గానే రియాజ్ వేట కోసం ఏ ఆర్ కు చెందిన స్పెషల్ పార్టీ బలగాలు రంగంలోకి దిగాయి నాలుగు వైపుల నుంచి జల్లెడ పడుతున్నాయి మరో వైపు డ్రోన్ కెమెరాలను సైతం పంపారు.
ఈ రోజు రాత్రి లోపే రియాజ్ ఆచూకీ కనుక్కోవాలని భావిస్తున్నారు. హత్య జరిగాక నిజామాబాద్ నగరం వదిలేసి పారిపోయాడని భావించిన పోలీసులకు దర్జాగా బాబాన్ సాబ్ పహాడీ ఏరియా బైక్ మీద చక్కర్ల కొట్టి నట్టుగా తెల్సి అవాక్కు అయ్యారు.
