నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. కృష్ణ మోహన్, సూపరింటెండెంట్ డాక్టర్ పి. శ్రీనివాస్, డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో వైద్యుల పాత్ర కీలకమైనదని, రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు బాధ్యతలను స్మరించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్: డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ కిషోర్ కుమార్. కె. రమాదేవి, మధుసూధన్,సూపరింటెండెంట్ పెద్దోళ్ల నాగరాజు, గంగాధర్, సాయిబాబా, రవిచంద్ర, పృధ్వీ, గాయత్రి, జ్యోతి, రంజిత్ కళాశాలలోని అన్ని విభాగాల వైద్యులు, యూజీ, పీజీ విద్యార్థులు, నర్సింగ్, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
