ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డాక్టర్ నాగమోహన్ గారిని బిసిటియు ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్ లో కలిసి శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించి సావిత్రి బాయి పూలే జ్ఞాపిక ను అందజేశారు.
ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ సేవా గుణం మరియు పేదల పక్షపాతి అయిన నాగమోహన్ జిల్లా ఆసుపత్రి కి సూపరింటెండెంట్ గా రావడం తో పేదలకు ఆరోగ్య పరంగా మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులు పెద్దొళ్ల నాగరాజు, బిసిటియు అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామ కృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కోశాధికారి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, వేణు, రవిచంద్ర, సుమన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
