నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ మరియు 31వ తేదీ నాగారంలోని రాజారం స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది.
ప్రతిభ కనబరిచిన 40 మంది అథ్లెట్స్ 7వ తేదీ హనుమకొండ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది.అండర్ 6,8,10,12,14,16 సంవత్సరాల బాలబాలికలకు 30వ తేదీ
అండర్ 18,20, స్త్రీ పురుషులకు 31వ తేదీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల , రాజా గౌడ్ తెలియజేశారు.
బాలుల విభాగంలో మూడు పాఠశాలలకు ఛాంపియన్షిప్ ట్రోఫీలు మరియు బాలికల విభాగాల్లో మూడు పాఠశాలకు ఛాంపియన్షిప్ ట్రోపీలు అందజేయడం జరుగుతుందని తెలిపారు .29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు సెల్ నంబర్ 9989040776.
