కారు ఢీ కొని వక్తి దుర్మరణం చెందిన ఘటన మోర్తాడ్ మండలంలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు…మోర్తాడ్ కు చెందిన రాజేశ్వర్(40).
వ్యవసాయ పనులు చేస్తారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి ఓ కారు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
