నిజామాబాద్ జిల్లాలోని మోకన్ పల్లి గ్రామంలో మిరియాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఇమ్మానియేల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలంలోని పాస్టర్లు తో పాటు జిల్లా కేంద్రం నుండి ముఖ్య ఉపాసకులు హాజరయ్యారు న్యూ ఇమ్మానియేల్ చర్చ్ మోకాన్ పల్లి అధ్యక్షులు డిస్టిక్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వం వహిస్తున్న బ్రదర్ మిరియాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి నూతన చర్చి ప్రారంభోత్సవ ప్రార్థనలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ప్రార్ధన అనంతరం చర్చి కమిటీ నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంఘ సభ్యులు పాల్గొన్నారున్యూ ఇమ్మానుయేల్ చర్చ్ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి బ్రదర్ మిరియాల సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఐపీసీ స్టేట్ ప్రెసిడెంట్ అహరోను నవీపేట్ మండల ప్రెసిడెంట్ అనంతయ్య చౌదరి నెహేమియా టి యు పి ఏ డిస్టిక్ ప్రెసిడెంట్ జేకర్య ఆనంద్ జోసెఫ్ పి ఏసుదాసు పాస్టర్ సోలోమన్ జాషువా పాస్టర్ జాన్సన్ సుధాకర్ తెలంగాణ ప్రభుత్వ ఫిజియోథెరపీ వైద్యుల సంఘం అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ రక్షా నెట్వర్క్ జాతీయ కార్యదర్శి మోడీ తామస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ జార్జ్ మట్ట ప్రవీణ్ సంఘ సభ్యులు తదితరులు నూతన చర్చి ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు.
