నిజామాబాద్ లో ద్విచక్ర వాహనాలు చోరి చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి, ఇందిరమ్మ కాలనీకి చెందిన కరిపే సుమన్ అను వ్యక్తి దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడి జిల్లాలోని కోరుట్ల, నవిపేట్, మండలాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వాటిని అమ్మటం కోసం వెళ్తుండగా బుదవారం ఒకటవ పోలీసులు పట్టుకొని విచారించగా ద్విచక్ర వాహనాలు చోరి చేస్తున్నట్లు నిజాం ఒక్కఉన్నారని పేర్కొన్నారు.అతని నుంచి రూ.2.5 లక్షల విలువ గల 5 ద్విచక్ర వాహనాలు రికవరీ చేసి,నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
