నగరంలోని పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు రెండవ టౌన్ ఎస్ఐ అరాఫత్ పేర్కొన్నారు.వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని దారుగల్లి లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించి 6 గురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ .17,838 నగదు,ఐదు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరాఫత్ పేర్కొన్నారు.
