రైలు ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నవిపేట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నవిపేట్ రైల్వే స్టేషన్ పరిధిలో సుమారు 55 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుచుండగ గూడ్స్ రైలు ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658591 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
