క్షణికావేశంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని 5వ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని నాగారం లోపల 80 కోటర్స్ కు చెందిన మీసాల కృష్ణ (44). టీ దుకాణం నడుపుతూ జీవనం గడుపుతున్నారు. మద్యం సేవించి తరుచూ భార్య విజయలక్ష్మి తో గొడవ పడేవాడని తెలిపారు.
గొడవ కారణంగా భార్య వల్ల అమ్మగరింటికి వెళ్లిపోయింది.అందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన రాకపోవడంతో క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
