ప్రమాదవశాత్తు పట్టాలు దాటుచుండగా రైలు ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని అర్సపల్లి వద్ద చోటుచేసుకుంది.
నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ కాజా అర్సపల్లి రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో అటు వైపుగా వెళ్తున్న బోధన్ ప్యాసింజర్ రైలు ప్రమాదవశాత్తు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అక్కడే ఉన్న స్థానికులు గమనించి రైల్వే పోస్టులు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ తరలించారు.
