చికిత్స పొందుతా వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని శాంతి నగర్ కు చెందిన షేక్ అహ్మద్(60).
ఈ నెల 21న పని నిమిత్తం నవి పేట్ వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో ఆర్సపల్లి ఎన్ ఎన్ ఫంక్షన్ హాల్ ముందు టాటా ఏసి వెనక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యుల హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హైదరాబాద్ రెఫర్ చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉందని మంగళవారం రాత్రి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ఇంట్లో మృతి చెందినట్లు తెలిపారు.
