చెరువులో జారీ పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బాన్సవాడ మండలం లో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సవాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన కే. నాగనాథ్,వయస్సు (60) వృత్తి.
కిరాణా దుకాణం.గుడిలో పూజ చేసిన పువ్వులు పారావేయడానికి చెరువు దగ్గరికి వెళ్లి అదుపు తప్పి చెరువులో పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ప్రగతి హాస్పిటల్ కు తరలించారు.
వైద్యులు చూసి ప్రభుత్వ ఆసుపత్రి కి సిఫారసు చేయగా, ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించారు.
