జిల్లాలో విద్యుత్తు శాఖలో విచ్చవిడగా మారిన వసూళ్ల దందా ఫై ఏసీబీ డేగ కన్ను వేసింది. ఆ విభాగంలో ఓ బృందం ఇదే కార్యాచరణలో నిమగ్నం అయింది. కొందరు అధికారులు తమ ఫై స్థాయి అధికారులను సైతం లెక్క చేయకుండా యథేచ్ఛగా వసూళ్ల దందా సాగిస్తున్నారు.
ముఖ్యంగా ఎఇ స్థాయి అధికారులు అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఓ మహిళా అధికారి వసూళ్ల దందా ఫై పిర్యాదు లు వెల్లు వెత్తుతుండడంతో ఏసీబీ అధికారులు సైతం రంగంలోకి దిగారు.
ఆమె విషయంలో ఎన్ని పిర్యాదులు వచ్చిన చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీన మేషాలు లెక్కిస్తుండడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తన ఫై స్థాయిలో ఉండే ఏ డి ఆదేశాలను సైతం సదురు ఎఇ కనీసం లెక్క చేయడం లేదు.సాధారణ ప్రజలతోను తల బిరుసుగా మాట్లడుతున్నారు.
ఏ పని కోసం వెళ్లినా తన వాటా సంగతి ఏమిటని బాహాటంగా అడుగుతున్నారు. చివరికి విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకొన్నా పట్టించుకోవడం లేదు. ఉన్నతధికారులకు పిర్యాదు చేస్తే కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అందుకే బాధితులు ఇప్పుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. అడ్డు గోలుగా వసూళ్ల దందా సంగతి విని ఏసీబీ అధికారులే విస్తు బోతున్నారు. మహిళా ఎఇ వసూళ్ల దందా ల మీద కొందరు బాధితులు ఏసీబీ వద్దకు వెళ్లిన వ్యవహారం విద్యుత్తూ అధికారుల కు తెల్సింది. దీనితో సదురు ఎఇ విషయంలో ఈసారైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి ?