Saturday, May 24, 2025
HomeLaw and Orderఆపరేషన్ సిందూర్ ను స్వాగతిస్తున్నాం......

ఆపరేషన్ సిందూర్ ను స్వాగతిస్తున్నాం……

న్యాయవాద పరిషత్పాకిస్తాన్,పాక్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తుందని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు.

తీవ్రవాదులే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ పై దాడి చేసి విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరూ సెల్యూట్ చేస్తూ గౌరవిస్తున్నారనీ,దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వనికి దేశ ప్రజలందరూ మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు.

దేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరి హిందు పౌరులను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను పూర్తిగా సైనిక చర్యల ద్వారా అంతమందించాలని కోరారు .

పాకిస్తాన్ ను తీవ్రవాద దేశంగా అంతర్జాతీయంగా ప్రకటించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల ద్వారా భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!