దొంతనం కేసులో ఇద్దరు అనుమానితులు పోలీసు స్టేషన్ నుంచి పారిపోయారు. ఈ ఘటన నగరంలోని ఆరో టౌన్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారు జామున జరిగింది.స్టేషన్ పరిధి లో ఇటీవల జరిగిన దొంగతనాలకేసుల్లో ముగ్గురు అనుమానితులను గుర్తించారు.
అందులో నాందేడ్ కు చెందిన షేక్ సిరాజ్ నగరంలోని ఆటో నగర్ కు చెందిన జిషన్ లను ఆరో టౌన్ పోలీసులు రెండు రోజుల క్రితమే అదుపు లోకి తీసుకున్నారు. మంగళవారం వీరిద్దరూ స్టేషన్ వెనక వైపు నుంచి విధుల్లో ఉన్న సిబ్బంది కళ్ళు గప్పి పారిపోయారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.
