ఆర్మూర్ పట్టణంలో ప్రముఖ న్యాయ వాదీ ఇంటిముందు ఆందోళన జరిగింది. ఇటీవలే చేపూర్ గ్రామానికి చెందిన బండ నడిపి గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంగాధర్ మృతికి అదే గ్రామానికి చెందిన విజయ్ తో పాటు న్యాయవాది కారణం అంటూ ఆరోపిస్తూ న్యాయవాది ఇంటి ముందు మృతుని బంధువులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
లాయర్ ఒత్తిడి వలన గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. అంతేకాకుండా కేసును తప్పుదోవ పట్టించేందుకు సీఐ మతిస్థిమితం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని మీడియాకు వెల్లడించడం కేసును తప్పుదో పట్టించడం అయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా కేసును విచారణ జరిపి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. సంఘటన స్థలానికి ఆర్మూర్ సీఐ రవికుమార్ చేరుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
