రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతికి చెందిన ఘటన నిజామాబాద్ నగర రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ రైల్వే స్టేషన్ గూడ్స్ పట్టాలపై గుర్తు తెలియని దాటుచుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు.
వ్యక్తి దగ్గర వివరాలు వెతకగా బాన్సువాడ నుంచి నిజామాబాద్ కు వచ్చిన బస్సు టికెట్ లభ్యమయింది. అలాగే అతని చెయ్యి పై ఆర్ఆర్ఆర్ అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు.
మృతుని వివరాలు తెలిసినా వారు రైల్వే ఎస్ఐ 8712658591 నంబర్ కు తెలుపగలరని సూచించారు.
అనంతరం ఉదయాన్నే పోస్టుమార్టం నిజామా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు.
