పసి కందుల అమ్మకలకు నిజామాబాద్ నగరం అడ్డా గా మారింది. ఇటీవలే ఎల్లమ్మ గుట్ట లో పసికందు అమ్మకం ఉదంతం వెలుగులోకి రాగ తాజాగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో మరో పసికందు అమ్మకం వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ నగరంలో ముజాయిద్ నగర్ కు చెందిన మహిళా తన తొమ్మిది నెలల కొడుకు ను అమ్మమానికి పెట్టింది రైల్వే స్టేషన్ ప్రాంతంలో బిక్షాటన చేస్తుంది.ముజాయిద్ నగర్ చెందిన సలావుద్దీన్ తో బేరం కుదిరిచింది లక్ష 25 వేల రూపాయలు ఇచ్చి ఆ బాలుడిని కొనుగోలు చేసిన సలావుద్దీన్ Ts 11 ek 0630 కారులో వచ్చి తీసుకెళ్లాడు.
రెహానా చెందిన రాత్రి 9 గంటలకు నుండి10గంటల మధ్యలో ఈ వ్యవహారం జరిగింది. సల్లావుద్దీన్ కి ముగ్గురు ఆడపిల్లలు కావడంతో కొడుకు కావాలనే తాపత్రయం తో మధ్యవర్తులను ఆశ్రయించాడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు
వెంటనే ఒకటో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి శనివారం మద్యాహ్నం మూడు గంటల వరకు బాలుని పట్టుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకోవచ్చారు. మొత్తం 5 గురిపై కేసు నమోదు చేశారు.
