నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని రద్దు చేయాలని ముక్త కంఠంతో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.గురువారం దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
విద్య సంస్థల బందుకు విరుద్ధంగా తెరిచి ఉంచిన స్కూల్ లను విద్యా సంస్థల నాయకులను మూసి వేయించారు.అందుకు విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్ లు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్, నెట్ పరీక్షల లీకేజీ వ్యవహారంతో విద్యార్థిలోకం అట్టుడికి పోతోంది. మరోవైపు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ కూటమిని టార్గెట్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలైన ఎస్ఐఎఫ్ (SFI), ఎఐఎస్ఎఫ్(AISF), పీడీఎస్యూ(PDSU), పీడీఎస్ఓ(PDSO), ఎన్ఎస్యూఐ(NSUI) జులై 4న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు.
