నాలుగు కార్లు , ఒక బైకు సీజ్
కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై ఇటీవల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న అనిల్ రెడ్డి మెరుపుదాడి చేశారు.
గత కొంతకాలంగా రహస్యంగా నడుపుతున్న ఈ పేకాట స్థావరం కార్పొరేట్ క్లబ్ కు మించిన స్థాయిలో కొనసాగుతుందని పలువురు పేర్కొన్నారు.
సోమవారం రాత్రి ఎస్సై అనిల్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి 35 మంది పేకాటరాయులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు లక్షల 38వేల రెండు వందల రూపాయలు , 35 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటు నాలుగు కార్లు ఒక బైకును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వెంకటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.