నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు.ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని ఆనంద్ నగర్ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వారి నుంచి రూ.4000 నగదు,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
