కొడుకు ను హత్య చేయడానికి వెళ్లి అతను పోవడంతో తండ్రి ని హత్య చేసిన ఘటన మోపాల్ మండలం కంజర గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడి కళ్ళలో కారం పొడి చల్లి ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు.
పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కూతురు భవిత ను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ తో వివాహం చేశారు.
కానీ భవిత ఆత్మ హత్య కు పాల్పడింది. భర్త గోవర్ధన్ వేధింపుల వల్లే కూతురు చనిపోయిందని కక్ష పెంచుకున్న సత్యనారాయణ ఎలాగైనా అల్లుడు గోవర్ధన్ ను హత్య చేయాలనీ ప్లాన్ చేసాడు.
బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు తో కలిసి గోవర్ధన్ ఇంటికి వెళ్ళాడు. కానీ అయన లేకపోవడంతో అతని తండ్రి నరహరి వెంటాడి కళ్ళలో కారం పొడి చల్లి ఆపై కత్తులతో విచక్షణ రహితంగా హత్య చేసి పారిపోయారు.
