ఎన్నికల ప్రచారంలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిజామాబాద్ నగరానికి రానున్నారు. ఆయన బుధవారం సాయంత్రం నగరంలోని గాంధీ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్నారు.
పాత కలెక్టరేట్ నుంచి బస్సు లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పోలీసు కమిషనర్ తో సమావేశం అయ్యారు. సీఎం పర్యటన కు సంబంధించి చర్చించారు.
