HomeCRIMEవారం రోజుల్లో 84 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు.

వారం రోజుల్లో 84 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన వారం రోజుల్లో కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.

ఈ వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి 27 నుండి 31 వరకు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 84 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి మొత్తం రూ. 7,90,000/- భారీ జరిమానా విధించినట్లు తెలిపారు.

అలాగే ఐదుగురికి కోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ప్రాణాపాయంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments