డి ఎస్ కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీలో పుట్టారు చివరికి కాంగ్రెస్ పార్టీలో చనిపోయారు అలంటిది అమిత్ షా తో విగ్రహవిష్కరణ చేసి ఆయన ఆత్మకు క్షోభ పెట్టారని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు.
డి.ఎస్. బీజేపీ లోకి వెళ్ళలేదు, కానీ డి.ఎస్. కు బీజేపీ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు.సోమవారం కంఠేశ్వర్ బైపాస్ వద్ద దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఆమిత్ షా నిజామాబాద్ వచ్చి అబద్దాలు చెప్పారుబీజేపీయేతర రాష్ట్రాల పై అవినీతి ఆరోపణలు చేయడం అమిత్ షా కు అలవాటుఅయిందన్నారు అధికారం చేతిలో ఉన్నా.బి. ఆర్.ఎస్. అవినీతి పై 10 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు రాజకీయ ఆరోపణలు తప్ప తెలంగాణ కు బీజేపీ చేసిందేమీ లేదుపసుపు బోర్డు కార్యాలయం ఎన్ని సార్లు ప్రారంభిస్తారు.
కార్యాలయాలు ప్రారంభిస్తే రైతులకు ఏం వస్తుంది.దమ్ముంటే పసుపు కు 15 వేలు మద్దతు ధర ప్రకటించాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతున్నారు స్థానిక సంస్థ ఎన్నికలకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చికే ఎన్నికలు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు
