డిచ్పల్లి పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఒక గ్రామంలో ఆరు సంవత్సరాల బాలికను 62 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
బాధితురాలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు ఈ ఘటన గత మూడు రోజుల క్రితం జరిగింది శుక్రవారం గ్రామంలోని కొందరికి వెలుగులోకి వచ్చింది.- ఆ పాపను లొంగ తీసుకునేందుకు వృద్ధుడు బాలికకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తానని నమ్మబలికి తను నివాసముంటున్న సొంత ఇంట్లో అత్యాచారం చేశాడని, పోలీసుల విచారణలో బాలిక పేర్కొన్నట్లు తెలిసింది. ఆ వృద్ధుడు గత 30 సంవత్సరాల క్రితం ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో జీవనం గడుపుతూ తెలంగాణకు 30 సంవత్సరాల క్రితం వచ్చి భార్య పిల్లలతో ఆటో రిక్షా నడుపుతూ జీవనం కొన సాగించాడు.
- కొద్దిరోజుల క్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో గుట్టు చప్పుడు కాకుండా చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తున్నట్లు గ్రామంలో పలువురు వాపోతున్నారు. కొంతమంది పిల్లలు అత్యాచారానికి గురై బయట చెప్పుకోలేక గోప్యంగా ఉండిపోయారని,ఆ కాలానికి చెందిన కాలనీవాసులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
- ఇలా ఎంతమంది చిన్నారులను అత్యాచారం చేశాడు పోలీసులు విచారణ చేసి కఠిన శిక్ష విధించాలని చర్చించుకుంటున్నారు. నిందితున్ని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా విశ్వాసనీయ సమాచారం.
పోలీసు అదుపులో ఉన్న ఆ నిందితున్ని శనివారం తిరిగి నిందితుడు ఇంటికి తీసుకొచ్చి అత్యాచారానికి గురైన బాలికను ఎక్కడ అత్యాచారం చేశావు ,ఏ స్థలంలో అత్యాచారం చేశావు , బాలికను ఎలా నమ్మబలికావు అన్ని వివరాలను ఎస్ ఐ, సి ఐ విచారణ చేపట్టగా తన సొంత ఇంట్లోని లోపల రూములో బాలికను అత్యాచారం చేశానని ఒప్పుకున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం.
బాలికను అత్యాచారం చేసిన వృద్ధుడు…పోలీసుల అదుపులో నిందితుడు
RELATED ARTICLES
