ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారి విలాస్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గా ఆర్మూర్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ అంజిత్ రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా గంగాధర్,వైస్ ప్రెసిడెంట్ గా భాస్కర్ రావు, జనరల్ సెక్రటరీ గా విక్రమ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా మల్లేష్,జాయింట్ సెక్రటరీ గా ఇన్స్పెక్టర్ వెంకటేష్, ట్రీసర్ అధికారిగా ప్రమోద్ చైతన్య లను ఎన్నుకున్నారు.
అలాగే నూతన ఎన్నికల అధికారులుగా దిలీప్,మధుసూదన్ రావు,తేజస్విని,శరత్ లను నామినేటెడ్ చేసినట్లు తెలిపారు.
