తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన బహిరంగ విచారణను నిర్వహించింది.
కొత్తగా ఏర్పాటైన బీసీ కమిషన్కు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కులాల సర్వే నిర్వహించి బీసీ వర్గాల జనాభా శాతాన్ని లెక్కించి స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లను నిర్ణయించే బాధ్యతను అప్పగించింది.
ఈ బహిరంగ విచారణలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయ ప్రకాష్,తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి , నిజామాబాద్ జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
