హైదరాబాద్ నగర పరిధిలోని ప్రముఖ రెస్టారెంట్లలో శనివారం రాత్రి ఫుడ్ సేఫ్టీ అధికారులు, 6 ప్రత్యేక బృందాలు మొత్తం 7 ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పరిశుభ్రతా లోపాలు, పురుగులు పట్టడం వంటి పలు తీవ్ర ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
బంజారాహిల్స్లోని చట్నీస్, స్పైస్ 6, ఓరీస్, జూబ్లీహిల్స్లోని ది స్పైసీ వెన్యూ, టోలిచౌకిలోని 4 సీజన్స్ మల్టీకుసిన్, షా ఘౌస్ రెస్టారెంట్లతో పాటు గచ్చిబౌలిలోని పిస్తా హౌస్లో ఈ బృందాలు సోదాలు జరిపాయి.
ఈ తనిఖీల సమయంలో కిచెన్లో సరైన పరిశుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం, శుభ్రత లేని వాతావరణంలో ఆహారాన్ని భద్రపరచడం, కుళ్లిపోయిన కూరగాయలు వాడటం, ఎఫ్ఎస్ఎస్ ఏఐ లేబులింగ్, డిస్ప్లే నిబంధనలను ఉల్లంఘించినట్లుగా అధికారులు కనుగొన్నారు.
/నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లకు అధికారులు 3 షోకాజ్ నోటీసులు, 4 ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. కల్తీ జరిగిందనే అనుమానంతో మొత్తం 7 రెస్టారెంట్ల నుంచి 11 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించారు.
గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ స్టోర్రూమ్లో మిస్బ్రాండింగ్ ఉల్లంఘనల కింద రూ.17,500 విలువైన 15 కిలోల డ్రై ఫ్రూట్స్, 24 కిలోల డ్రై నూడుల్స్, 5 కిలోల పొటాటో చిప్స్ను స్వాధీనం చేసుకున్నారు.
