మాజీ కార్పొరేటర్, ప్రస్తుత 16వ డివిజన్ కార్పొరేటర్ అనిత భర్త పంచ రెడ్డి సురేష్ గారు అకస్మికంగా మరణించారు. ఈ వార్త స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బుదవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు.
పంచ రెడ్డి సురేష్ గారు గతంలో కార్పొరేటర్గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన భార్య 16వ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతుండగా, ఆయన బీజేపీలో కీలక నాయకుడిగా క్రియాశీలకంగా ఉండేవారు.ఆయన మరణవార్త తెలియగానే తోటి రాజకీయ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు.
