కామారెడ్డి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, BRS పార్టీ మండల అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని రాష్ట్ర యువ నాయకులు గంప శశాంక్ గారు నియోజకవర్గ వ్యాప్తంగా తన జన్మదిన వేడుకలను రద్దుచేసుకోని, హుటాహుటిన కామారెడ్డి చేరుకొని ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులతో, అంజన్న గారితో తనకున్న అనుభందాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపి, అంజన్న గారికి తన నివాళులు అర్పించారు.
