తమ గణపతి వద్ద గుర్తు తెలియని వ్యక్తి లడ్డు ఎత్తుకెళ్ళడంటూ కొందరు భక్తులు పోలీసులను ఆశ్రయించారు చందానగర్లోని హుడా కాలనీ తేజ రెసిడెన్సీలో ఈ ఉదంతా జరిగింది .
గణపతి మండపంలో ఉంచిన లడ్డూతో పాటు నగదును గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు అపార్ట్మెంట్ వాసులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే దుండగుడు ఈ చోరీకి పాల్పడ్డాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.దీనితో పోలీసులు రంగంలోకి దిగారు
