HomePOLITICAL NEWSAndhra Pradeshపోలీసులు మీద దాడులకు తెగబడ్డ గంజాయి ముఠా ......కాల్పులు జరిపిన పోలీసులు

పోలీసులు మీద దాడులకు తెగబడ్డ గంజాయి ముఠా ……కాల్పులు జరిపిన పోలీసులు

ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులపై తిరగబడి రాళ్ల దాడి చేశారు.చివరికి పోలీసులు కాల్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ ఘటన ఏపీ లోని అల్లూరి జిల్లాలో గురువారం జరిగింది అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు .

ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న కారును ఆపి తనిఖీ చేస్తుండగా…కారులో ఉన్న గంజాయి ముఠా రాళ్ల దాడికి దిగింది అంతే కాకుండా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడని.పోలీసులు ఒకసారిగా షాక్ అయ్యారు వెంటనే తేరుకొని పోలీసులు. గాల్లోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు లొంగిపోయారు .

ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నామని… వీరు ఆంధ్ర, ఒడిస్సా, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారగా గుర్తించామని తెలిపారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి  209 కిలో గంజాయి, రెండు బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments