ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థినికి విద్యుత్ ఘాతం చెంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారుల ప్రాణాలతో చెలగతాడుతున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు.
పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని,తెగిన విద్యుత్ తీగలు,అద్వనంగా ఉన్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడనీ తల్లిదండ్రులు వాపోతున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనమిదవ తరగతి చదువుతున్న సులోచన(11) అనే విద్యార్థిని రోజు మాదిరి ఉదయం పాఠశాలకు వెళ్ళింది.
ఈ మేరకు తరగతి గదిలో వేలాడుతున్న విద్యుత్ తీగకు చెయ్యికి తగిలి విద్యార్థినీ తీవ్ర అస్వస్థత కు గురైంది. అది గమనించిన తోటి విద్యార్థినిలు పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.


