కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నక్సల్స్ మందుపాతరకు బలైనందున ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
వారి అంత్యక్రియలకు హజరై నివాళులు అర్పించారు.ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు