గురువారం రాత్రి పంజాబ్ రాజస్థాన్ ల్లో జమ్మూలో విరుచుకుపడేందుకు వచ్చిన పాక్ డ్రోన్లను భారత సైన్యం తిప్పికొట్టింది. శుక్రవారం కూడా పాకిస్తాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాల సమాచారం తో భారత్ అప్రమతం అయింది.
ముఖ్యంగా సరిహద్దు లో పంజాబ్ ప్రాంతం ను టార్గెట్ చేసి నట్టుగా అనుమానిస్తున్నారు. భారత్ గత రాత్రి కరాచీ ఇస్లామాబాద్ లో వైమానిక దాడులు చేసింది దానికి ప్రతీకారంగా నే పాకిస్తాన్ దాడులు చేసే ఛాన్స్ వుందని ఆర్మీ అప్రమత్తం అయింది.
శుక్రవారం ఉదయం 8 ప్రాంతంలో అమృతసర్ లో సైరగన్ మోగగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చండీఘడ్ లో భద్రతా దళాలు ఎయిర్ సైరన్ మోగించాయి. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. బాల్కనీల్లో కూడా ఉండద్దని ప్రజలకు సూచించారు.
పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల దగ్గర హైఅలర్ట్ ప్రకటించింది భారత రక్షణశాఖ . ఎయిర్పోర్టుల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచించింది..భారత్పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. పీవోకేలో భారతదేశం భారీ ప్రతీకార దాడిని ప్రారంభించింది. ఫిరంగి నుండి గుండ్లు దూసుకుపోతున్నాయి.
అంతే కాకుండా, డ్రోన్లను ఉపయోగించి ఎదురుదాడి కూడా జరుగుతోంది. .
//// ఇండియా గేట్ ఖాళీ చేయించిన అధికారులు/////////
పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. సరిహద్దు ప్రాంతంలో భయాందోళనలు, గందరగోళం నెలకొంది. భారతదేశం తన దేశ అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల కోసం కూడా బలమైన ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా ఇండియా గేట్ పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఇండియా గేట్ చుట్టూ ఎవరూ ఉండటానికి వీలులేకుండా బ్యారికేడ్ పెట్టారు అక్కడే అదనపు బలగాలను మోహరించారు