ఓ పెండ్లి ఫంక్షన్ కు వచ్చిన హిజ్రా లు తెల్లవారు జామున దాక డీజే లతో అశ్లిలంగా డ్యాన్స్ లు చేస్తుండడం తో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వేదిక వద్దకు వచ్చి వారించారు .
పెండ్లి వుందని అందుకే డ్యాన్స్ లు చేస్తున్నామని చెప్పారు. తెల్లవారు జామున మూడు దాక డీజే లు పెడితే ఎలా ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కదా అంటూ పోలీసులు మందలించారు.
ఈ ఈవెంట్ కు నగరంలో ని పలువురు రౌడీ షీటర్లు సైతం తరలి రావడంతో డ్యాన్స్ వేదిక నుంచి హిజ్రా లను తరలించడానికి పోలీసులు శ్రమించారు ఓ దశలో లాఠీ ఛార్జ్ కూడా చేశారు.చివరికి హిజ్రా లను స్థానిక ఆరో టౌన్ స్టేషన్ కు తరలించారు
