ఆదివారం ఎల్కతుర్తి లో బిఅర్ఎస్ తలపెట్టిన సభ సక్సెస్ ఫై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారీ ప్రజలను ఈ సభ కు తరలించడం ద్వార సత్తా చాటాలని బిఆర్ యస్ పట్టుదలతో వుంటే సభ జనం వెళ్లకుండా నియంత్రించే దిశగా అధికార పార్టీ ఎత్తుగడలు వేస్తుంది సంక్షేమ పథకాలను బూచి గా చూపి సభ వైపు చొద్దని సంకేతాలు పంపుతుంది.
మీ ఊరి నుంచి ఎవరు వెళ్ళద్దు వెళ్లకుండ కట్టడి చేసే బాధ్యత మీదే ఎమ్మెల్యే నిఘా వేశారు ఆయన చాల సీరియస్ గా ఉన్నారు ఎవరైనా వెళ్లితే ప్రభుత్వ పథకాలు ఎవ్వి మీకు దక్కవు.అసలు మీ ఊళ్ళో ఏ పని జరగదు మీ ఇష్టం అంటూ అధికార పార్టీ వాట్సప్ ల్లో ధమ్కీ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి .
ముఖ్యంగా గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులఫోన్ ల్లో పార్టీ వాట్సప్ గ్రూప్ లకు వస్తున్న మెసేజ్ లు ఇవీ ! రాజీవ్ వికాస్ యువశక్తి, ఇందిరామ్మా ఇల్లు తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వబడవు అంటూ అధికార పార్టీ ముఖ్య నేతల ఫోన్ లనుంచి గ్రామ స్థాయి నేతల ఫోన్ లకు వస్తున్న మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
నాయకులకు వాట్సాప్ సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్న తీరు తెగ వైరల్ అవుతుంది. అలాగే గ్రామ స్థాయి నాయకులు, కోఆర్డినేటర్ లు ఈ విషయంలో మన ఎమ్మెల్యే సీరియస్ గా ఉన్నారని గ్రామ స్థాయి నాయకులకు హెచ్చరిక చేస్తూన్న మెసేజ్ సోషల్ మీడియాలో శనివారం తెగ వైరల్ అవుతుంది.
ఏ ప్రభుత్వం వచ్చిన పార్టీలను పక్కన పెట్టి అందరిని కలుపుకొని సంక్షేమ పథకాలు అందేలా చూడాలి కానీ ఇలాంటి ప్రకటనలు చేయడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లా లో ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ల పేరిట ఈ మెసేజ్ రావడం తో బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తం అయ్యారు .
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను వరంగల్ సభ కు తరలించడానికి చెమటలు కక్కుతుంటే అధికార పార్టీ రూపం లో ఎదురౌతున్న ప్రతికూల అంశాలను గులాబీ నేతలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఖర్చు తడిసి మోపెడు అయినా సరే తగ్గదే లేదంటున్నారు