ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో గురువారం ఉదయం ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రపురం, తడపాల గుట్టలపై దట్టమైన అడవుల్లోజరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు మృతి చెందారు ఈ మృతుల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉన్నట్లు సమాచారం.
మాచారెడ్డి పరిధిలోగల పాల్వంచ గ్రామానికి చెందిన గ్రేహౌండ్స్ కు చెందిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ ఉన్నారు మూడు రాష్ట్రాల పోలీసులు ఆపరేషన్ కాగర్ పేరుతొ కర్రీ గుట్టలలో . తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. .
పక్కా ప్లాన్ ప్రకారం గ్రేహౌండ్స్ జవాన్లను ట్రాప్ చేసిన మావోయిస్టులు ల్యాండ్మైన్ ఉన్న ప్రాంతానికి బలగాలు రాగానే ఒక్కసారిగా పేల్చేశారు. ఈ భారీ పేలుడులో కూబింగ్కు వచ్చిన ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..