HomeCRIMEకరీం నగర్ లూటీ కేసు .....నిందితుల బైకు లభ్యం.

కరీం నగర్ లూటీ కేసు …..నిందితుల బైకు లభ్యం.

కరీంనగర్ నగరంలో జువెలరీ షాప్ లూటీ కేసులో దర్యాప్తు లో పురోగతి సాధించారు. దోపిడీ ముఠా వాడిన బైక్ దొరికింది.  పల్సర్ బైక్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు సోమవారం లభ్యం అయింది.

కానీ ఆ బైకు కు మాత్రం కారు నెంబర్ ప్లేట్ తగిలించారు.సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు నిందితులు ఆ బైకును అక్కడే వదిలేసి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. పోలీసులకు దొరికిన బైక్ కు ఉన్న నెంబర్ ప్లేటు బలెనో కారుకు సంబంధించింది.

హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ను పల్సర్ వాహనాలకు ఉపయోగించారు. దొంగలు బీర్పూర్ – ధర్మపురి మార్గం గుండా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.. నిందితులు ధర్మపురి వద్ద గోదావరి నదిని దాటి, మహారాష్ట్ర సరిహద్దు వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments