పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒత్తిడి తో ఎట్టకేలకు సీపీ డీజే ల విషయంలో సానుకూలత వ్యక్తం చేసారు షరతులతో డీజే ల నడపడానికి అంగీకరించారు దసరా పండగ నేపథ్యంలో పోలీసు శాఖ DJ షాప్ విధించింది.
డీజే నిర్వాహకులు శనివారం నిజామాబాదు లో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ ను డీజే నిర్వాహకులు కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు దీనితో మహేష్ గౌడ్ వెంటనే సీపీ కల్మేశ్వర్ తో మాట్లాడారు పండగ రోజుల్లో ఇలాంటి ఆంక్షలు అమలు చేస్తే నిర్వాహకులు ఉపాది కోల్పోతారని చెప్పారు
డీజే నిర్వాహకుల ఆవేదన సైతం స్వయంగా వినాలని డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వస్తారని చెప్పారు వారంతా ఆదివారం సీపీ కలసి వినతి పత్రం సమర్పించారువారి సాధకబాధలు విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
కొన్ని షరతులతో DJ లకు అనుమతి ఇవ్వడానికి అంగీకరించారు వారు ఈ నెల 30 వరకు లైసెనుసులు , పర్మిషన్లు తప్పకుండ తీసుకోవాలని తెలిపారు.
ఇతర రాష్ట్రాల మరియు ఇతర జిల్లాల నుండి వచ్చే DJ లను పూర్తిగా నిషేధం కొనసాగుతుందని ప్రజలకు, సీనియర్ సిటిజన్స్ కు, పిల్లలకు ఇబ్బంది కలుగకుండా చట్ట పరిధిలో రెండు సౌండ్ బాక్స్ సిస్టమ్ లు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు
