రైలు లోపల ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు.
రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బోధన్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గుంతకల్ ప్యాసింజర్ రైలు బోగీ లోపల ఎవ్వరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థానానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్ కు ఫోన్ చేసి తెలపగలరని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
