కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జుక్కల్ మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని మాందాబాద్ గ్రామానికి చెందిన చందర్ వయస్సు (43) వృత్తి వ్యవసాయం.
తరుచూ ఇంట్లో గొడవలు కారణంగా మద్యం మత్తులో ఇంటి నుండి వెళ్ళిపోయి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటా హుటిన బ్యాన్సువాడ ఆసుపత్రి కి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
