ప్రమాదవశాత్తు నీటి కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు…
గుర్తు తెలియని వ్యక్తి సోమవారం సారంగాపూర్ డైరీ ఫారం వద్ద ఉన్న కాలువ గట్టు పై కూర్చొని ఉన్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు కాలు జారీ కాలువలో పడి గల్లంతైనట్లు తెలిపారు.
స్థానికులు గమనించి నీటిలో గాలించి మృతదేహాన్ని వెతికి తీసినట్లు పేర్కొన్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
