ప్రమాదవశాత్తు నీటి కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు…
ధర్మపురి హిల్స్ కు చెందిన అక్బర్ ఖాన్(38).ఆదివారం ఉదయం సారంగాపూర్ డైరీ ఫారం వద్ద ఉన్న కాలువ గట్టు పై కూర్చొని ఉన్నట్లు తెలిపారు.
ప్రమాదవశాత్తు కాలు జారీ కాలువలో పడి గల్లంతైనట్లు తెలిపారు.స్థానిక కాలనీవాసులు,కార్పొరేటర్ లు అక్కడికి చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు ఆరవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
