నగరంలో వ్యక్తి అదృశ్యమైన సంఘటన రెండవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
రెండవ టౌన్ ఎస్ఐ యాశీర్ అర్ఫత్ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని దారు గల్లికి చెందిన షేక్ మెహబూబ్(35).మతిస్థిమితం లేక ఈ నెల 16 రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
దినితో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ వ్యక్తి ఎడమ చేతికి పోలియోతో ఉంటాడు. ఈ మేరకు శుక్రవారం రెండవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు .
వ్యక్తి వివరాలు తెలిసిన వారు రెండవ టౌన్ 8712659838 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
